తెలుగు భాషకు రాబోతున్న ముప్పు ?

నదేశంలో హిందీ తర్వాత ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగు. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా తెలుగు మాట్లాడేవారు తారసపడతారు . తెలుగు మాతృభాషగా లేనివాళ్ళు  కూడా తెలుగును నేర్చుకుని మరీ మాట్లాడుతున్నారు . చెన్నై, బెంగళూరు లలో అయితే దాదాపు 40-50% మందికి తెలుగు మాట్లాడ్డం వచ్చు.  తెలంగాణా రాష్ట్ర విభజన జరిగినప్పుడు దేశంలో హిందీ తర్వాత తెలుగుకే రెండు రాష్ట్రాలు ఉన్నాయని, ఇక ఈ భాషకు తిరుగులేదని , పోటాపోటీగా రెండు రాష్ట్రాలూ తెలుగు భాషను ప్రోత్సహిస్తాయని అనుకున్న చాలామందిలో నేనూ  ఉన్నాను . . అయితే ప్రస్తుతం తెలుగుకు పడుతున్న దుస్థితి చూస్తుంటే భవిష్యత్ లో తెలుగు భాష ఉంటుందా అనే అభిప్రాయం కలుగుతుంది నాకు. ఒకప్పుడు పాథశాల స్థాయిలోనే విద్యార్ధులు కధలు, కవితలు వ్రాసేవారు . వారే కాల క్రమేణా మంచి రచయితలుగా మారే అవకాశం ఉండేది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే భవిష్యత్ లో తెలుగు సినీ పరిశ్రమకు కూడా పాటల రచయితలు దొరకక పోవచ్చేమో .
 ఈ మధ్య తమిళనాడులో తెలుగు మీడియం పాఠశాలలు మూసివేయాలన్న ఆ ప్రభుత్వ నిర్ణయంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్దగా వ్యతిరేకత ఆయా ప్రభుత్వాల నుంచి రాలేదు .కటువుగా చెపుతున్నాననిపించవచ్చు గానీ కనీసం ఇక్కడి ప్రజలలో కూడా తెలుగు భాషపై మమకారం ఉన్నట్లు అనిపించడం లేదు . ఇంగ్లీషు మీడియంలో పిల్లలను చదివించడం తప్పు కాదు . రెండో మాధ్యమంగా సంస్కృతం, హిందీ లాంటి భాషలను ఎంచుకోవడం, ఇంట్లో గానీ స్నేహితులతో గానీ ఎక్కువగా ఇంగ్లీషులోనే మాట్లాడడం , ఇంగ్లీష్, హిందీ చానల్స్ ఎక్కువగా చూడడం ఇవన్నీ తెలుగు పట్ల మనకున్న ఏ అభిప్రాయానికి చిహ్నాలు ?
అయితే ఇక్కడ ప్రజలవైపు నుంచి ఆలోచిస్తే వారు చెప్పే మాట - " తెలుగులో మాట్లాడితే జాబ్స్ రావు, ఏ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలన్నా ఇంగ్లీష్, హిందీ తప్పనిసరి అని " వారు చెప్పేది సరైనదే ! ఈ అలోచన రాకుండా చర్యలు తీసుకోవలసినది ఇక్కడి ప్రభుత్వాలు.  తెలుగును తప్పనిసరి చేయడం , తెలుగు భాష ప్రాధాన్యతగా పరీక్షా పత్రాల ముద్రణ ( ప్రస్తుతం ఏ ప్రభుత్వ పరీక్షలలోనైనా  తెలుగుతో పాటు ఆంగ్లంలో కూడా ప్రశ్నలు ముద్రిస్తున్నారు ) లాంటి చర్యలు తీసుకోవాలి . బాధాకరమైన విషయాలు  ఏమిటంటే మన ఎమ్మెల్యేలు చాలమంది కూడా అసెంబ్లీల్లో ఇంగ్లీషులోనే ప్రసంగాలు చేయడం, పాథశాల/కళాశాల ఉత్సవాల్లో డ్యాన్స్ పోటీలకు ఇచ్చిన ప్రాధాన్యతలో పదోవంతు కనీసం తెలుగు కవితల, కధల పోటీలకూ ఇవ్వకపోవడం.
ఇవన్నీ ఏ విధంగానూ మంచి పరిణామాలు కావు. తెలుగుకు రానున్న ముప్పును గుర్తించి ఇప్పటికైనా మేధావులు, విజ్ఞులు తెలుగు భాష ప్రాముఖ్యత పెంచేలా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలి.


6 comments:

  1. ఆయ్! దెబ్బలాటకూడా తెనుగులో ఉండటం లేదండి బాబూ! మనది కంఠశోషేనేమో

    ReplyDelete
    Replies
    1. ఆయ్ శర్మ గారు,

      దెబ్బలాట చేయాలంటే తిట్టు కోవాలండి ! తిట్టి తెలుగుని తక్కువ చేయ లేమండి ! అందుకే 'ఎంగిలి' పీసు లో నే తిట్టు కునేదో ,దెబ్బలాడు కునేదో చేసుకుంటా మండీ ! :) ఆయ్ ! ఎంతైనా తెలుగు తల్లి కదండీ ! ఆ పాటి మర్యాద ఉండాలి మరి !

      జిలేబి

      Delete


  2. ఆ ఇంగిలి పీసు లేకుంటే ఇట్లా బ్లాగులు గట్రా తెలుగులో వ్రాయ గలిగి ఉండే వాళ్ళమా ?

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఇది మీ లోకజ్ఞాన లేమిని చెప్తుంది ! కీబోర్డ్ ఇంగ్లీష్ లో ఉంటె తెలుగు టైపు చేయటానికి అదొక్కటే మార్గం అనుకోవటం అమాయకత్వం .చినీయులు, జపనేయులు వారి భాషనూ ఇంగ్లీషులో టైపు చేయరు . అక్కడిదాకా ఎందుకు నేను వాడేది స్విఫ్ట్ కీ , ఏ భాష అయినా తిన్నగా టైపు చేయవచ్చు ఇంగ్లీశుఇ అవసరం లేకుండా , వాడాలన్న కుతూహలమ్ ఉండాలి అంతే .

      Delete
    2. ఆహా ఏమి పరిజ్ఞానము లోక జ్ఞానము :)

      స్విఫ్ట్ కీ వెనుక ఏ భాష లో సాఫ్టు ఉన్నదో కొండ పైనున్న పెరుమాళ్ళ కే ఎరుక :

      జేకే !

      చీర్స్
      జిలేబి

      Delete
  3. జిలేబీ గారూ ! ప్రపంచంతో నడవాలంటే ఇంగ్లీష్ అవసరం ఎంతైనా ఉంది అలా అని తెలుగు భాష కనుమరుగు అవ్వాలని కోరుకోకూడదు , కోరుకోము కదా దీనికి కనీస చర్యలు తీసుకోగలిగేవి ప్రభుత్వాలే అని నా ఉద్దేశ్యం .. దానికి మీరేమంటారు

    ReplyDelete

hit counter